హైదరాబాద్: ఎస్సీల సంక్షేమం, అభ్యున్నతికి అమలవుతున్న పథకాలపై సోమవారం ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష జరిపారు. సంక్షేమ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్,కమిషనర్ యోగితారాణా,ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.ఈ పథకం ద్వారా విదేశాలలో విద్యనభ్యసించాలనే ఆసక్తి కలిగిన యువతకు 20లక్షల రూపాయలు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాలని,అవసరమయితే నిబంధల్ని సడలించి సహాయం చేయాలని అన్నారు.
ప్రజా ప్రతినిధిగా తాను ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూశానని చెప్పారు.సంక్షేమ వసతి గృహాలలో సదుపాయాలు మరింత మెరుగు పర్చాలని సూచించారు. ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న హాస్టళ్లలో సౌరశక్తిని ఉపయోగించి వాటర్ హీటర్లు,కోల్డ్ స్టోరేజ్ లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలన్నారు.వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులయ్యే వారికి రాష్ట్రంలో 12 స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. అన్ని జిల్లా కేంద్రాలలో స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి