Karimnagar: అధికారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-08-30T19:16:08+05:30 IST
దళిత బంధు సర్వే చేస్తున్న అధికారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వస్తుంటే కనీస ఏర్పాట్లు చెయ్యవా అంటూ మండిపడ్డారు.
కరీంనగర్: దళిత బంధు సర్వే చేస్తున్న అధికారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వస్తుంటే కనీస ఏర్పాట్లు చెయ్యవా అంటూ మండిపడ్డారు. మంత్రుల కంటే ఎక్కువ బిజీ అయ్యారు అంటూ అధికారి మీద సీరియస్ అయ్యారు. చేతిలో ఉన్న ఫోన్ను కింద పడేసి మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. జిల్లాలోని జమ్మికుంట మున్సిపల్లోని 21 వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.