అంబేడ్కర్ జయంతి పోస్టరును ఆవిష్కరించిన మంత్రి కొప్పులఈశ్వర్

ABN , First Publish Date - 2022-04-10T02:02:09+05:30 IST

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టర్ ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు

అంబేడ్కర్ జయంతి పోస్టరును ఆవిష్కరించిన మంత్రి కొప్పులఈశ్వర్

హైదరాబాద్: భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టర్ ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  శనివారం ఆవిష్కరించారు.షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతిని ట్యాంక్ బండ్ సమీపాన ఉన్నఆయన విగ్రహం వద్ద ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది.ఈ సందర్భంగా కమిటీ రూపొందించిన పోస్టరును మంత్రి శనివారం హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ ఛైర్మన్లు రావుల విజయ్ కుమార్,నాగారం బాబు మాదిగ, వైస్ ఛైర్మన్ ఏర్పుల యాదయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, నాయకుడు మేడి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-04-10T02:02:09+05:30 IST