మెట్రోరైలులో ప్రయాణించిన మంత్రి కొప్పులఈశ్వర్

ABN , First Publish Date - 2022-03-17T22:10:58+05:30 IST

రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి హైదరాబాద్ లో గురువారం మెట్రో రైలులో ప్రయాణించారు.

మెట్రోరైలులో ప్రయాణించిన మంత్రి కొప్పులఈశ్వర్

హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి హైదరాబాద్ లో గురువారం మెట్రో రైలులో ప్రయాణించారు.నగరంలో రోజురోజుకూ మెట్రో ప్రయాణానికి నగర వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపధ్యంలో నగర అందాలను వీక్షించడంతో పాటు,ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించుకోవచ్చని, అలాగే మెట్రో ప్రయాణ అనుభవం కోసం కూడా తాము మెట్రోరైల్ లో ప్రయాణించినట్టు వారు తెలిపారు. సరూర్ నగర్ లోని వి.ఎం.హోం గురుకుల పాఠశాలలో ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించేందుకు గాను మెట్రోరైలులో అసెంబ్లీ స్టేషన్ నుంచి వి.ఎం.హోం స్టేషన్ కు వరకు మెట్రోలో ప్రయాణించారు. అనంతరం అక్కడి నుంచి వారు కారులో వి.ఎం.హోం పాఠశాల వద్దకు చేరుకున్నారు.


Updated Date - 2022-03-17T22:10:58+05:30 IST