అంబేడ్కర్ విగ్రహ పనుల పురోగతిని పరిశీలించిన కొప్పుల

ABN , First Publish Date - 2021-12-24T01:29:55+05:30 IST

గరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన, సచివాలయానికి చేరువలో రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు జరుగుతున్నవిషయం తెలిసిందే.

అంబేడ్కర్ విగ్రహ పనుల పురోగతిని పరిశీలించిన కొప్పుల

హైదరాబాద్: నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన, సచివాలయానికి చేరువలో రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు జరుగుతున్నవిషయం తెలిసిందే.దీనికి సంబంధించి కొనసాగుతున్న పనుల పురోగతిని గురువారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి వెంట ప్రభుత్వ విప్ గువ్వల బాల్ రాజు, ఎమ్మెల్యేలు సాయన్న,అబ్రహం,క్రాంతి కిరణ్,మెతుకు ఆనంద్,ఈఎన్సీ గణపతి రెడ్డి తదితరులు ఉన్నారు. 


విగ్రహ రూపశిల్పి, అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సుమారు రెండు గంటల పాటు మంత్రి సమీక్ష జరిపారు,ఈ సందర్భంగా 125 అడుగుల నమూనా విగ్రహాన్నిఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ భారతరత్న అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.రాష్ట్ర ఏర్పాటుకు మహత్తర ఉద్యమం నడిపి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కేసిఆర్, ఇందుకు రాజ్యాంగం ద్వారా దారి చూపిన అంబేడ్కర్ ను గొప్పగా గౌరవించాలనే, భావితరాలకు స్పూర్తినివ్వాలనే మహదాశయంతో 125 అడుగుల విగ్రహ ఏర్పాటు జరుగుతున్నదని అన్నారు. 

Updated Date - 2021-12-24T01:29:55+05:30 IST