టీఆర్ఎస్ కు చారిత్రాత్మక దినం: కొప్పుల

ABN , First Publish Date - 2021-11-29T00:29:51+05:30 IST

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోయేందుకు కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిన రోజు నవంబరు 29 అని, అది చారిత్రాత్మకమైన రోజుగా ఎస్సీ, బిసి, మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు

టీఆర్ఎస్ కు చారిత్రాత్మక దినం: కొప్పుల

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోయేందుకు కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిన రోజు నవంబరు 29 అని, అది చారిత్రాత్మకమైన రోజుగా ఎస్సీ, బిసి, మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆరోజు టీఆర్ఎస్ పార్టీకి సైతం చారిత్రాత్మకమని అన్నారు. తాను సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ 2009, నవంబరు 29న దీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని మంత్రి తెలిపారు.


కేసీఆర్ పదవులను తృణప్రాయంగా వదిలేసి పోరుబాట పట్టిన యోధుడని మంత్రి కొప్పులఈశ్వర్ కొనియాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు టీఆర్ఎస్‌ను స్థాపించి సబ్బండ వర్గాల ప్రజలను ఏకం చేసి మహోద్యమాన్ని నడిపిన మహానేత కేసీఆర్ అని కొప్పుల కొనియాడారు.

Updated Date - 2021-11-29T00:29:51+05:30 IST