సీఎం సభ సక్సెస్‌ అయ్యింది: కొప్పుల

ABN , First Publish Date - 2021-08-17T00:08:44+05:30 IST

దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా శాలపల్లిలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ సక్సెస్‌ అయ్యిందని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

సీఎం సభ సక్సెస్‌ అయ్యింది: కొప్పుల

హుజూరాబాద్‌ః దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా శాలపల్లిలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ సక్సెస్‌ అయ్యిందని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. దళిత జాతి ఉద్దరణకు మహత్తరమైన పధకాన్ని ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం సభ అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మీడియాతో మాట్లాడారు. 


దళిత బందు పధకం ప్రారంభోత్సవం సభకు రాలేక పోయినా తెలంగాణ వాసుతు, దేశ , విదేశాల్లో ఉన్న కోట్లాది మంది తెలంగాణ బిడ్డలు ప్రసార మాధ్యమాల్లో చూసి సంతోషించారని తెలిపారు. దళిత జనులంతా ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా అద్భుతమైన పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు. సభ విజయంతం కావడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మంత్రికొప్పుల ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-08-17T00:08:44+05:30 IST