పశుపోషకులను ఆదుకోవడమే లక్ష్యం : కొడాలి
ABN , First Publish Date - 2020-05-24T07:59:26+05:30 IST
పశుపోషకులను ఆదుకునేందుకే ప్రభుత్వం వైఎస్ఆర్ పశుపోషక నష్టపరిహార పథకం ప్రవేశపెట్టిందని మంత్రి కొడాలి నాని అన్నారు.
గుడివాడ : పశుపోషకులను ఆదుకునేందుకే ప్రభుత్వం వైఎస్ఆర్ పశుపోషక నష్టపరిహార పథకం ప్రవేశపెట్టిందని మంత్రి కొడాలి నాని అన్నారు. జేడీ డాక్టర్ విద్యాసాగర్తో కలిసి పశుఆరోగ్య సంరక్షణ కార్డు, గొర్రెల మేకల ఆరోగ్య సంరక్షణ కార్డులను మంత్రి ఆవిష్క రించారు. పశువైద్య సేవలు పొందడానికి కార్డులు వినియోగించాలని సూ చించారు. డాక్టర్ కామేశ్వరరావు, డాక్టర్లు మాధవరావు, హనుమంతరావు, లోకేష్ పాల్గొన్నారు.