సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2022-07-15T22:04:41+05:30 IST
రాష్ట్రంలో టీఆర్ఎస్ పీఠాలు కదిలిపోతున్నాయి కాబట్టే టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పీఠాలు కదిలిపోతున్నాయి కాబట్టే టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రజలపై కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని కిషన్రెడ్డి కిషన్ రెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.పార్లమెంట్ ఉన్నది యుద్ధాలు చేసేందుకు కాదనీ, ప్రజాసమస్యలపై చర్చించేందుకన్న విషయాన్ని గుర్తంచుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం వరి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు పర్యటిస్తాయని చెప్పారు.వారి రిపోర్టుల ఆధారంగా వరద సాయం అందిస్తామని అన్నారు.