కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదు: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2021-11-14T00:11:01+05:30 IST
ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి కేంద్రంతో ఎందుకు
హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత దళితబంధు పథకం అమలు చేస్తామన్న సీఎం మాటలు ఎటుపోయాయన్నారు. గిరిజన, బీసీ, మైనారిటీ బంధు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ధర్నా చౌక్ అవసరం లేదన్న వాళ్ళే ధర్నాలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అప్పులు చేసి కమీషన్ తీసుకున్న చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి లేదని కిషన్రెడ్డి పేర్కొన్నారు.