ఇగురం రచయిత గంగాడి సుధీర్ ని అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN , First Publish Date - 2022-05-23T00:01:24+05:30 IST
రాజా రామ్మోహన్ రాయ్ 250 జన్మదినోత్సవాన్ని తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(kishan reddy) హాజరయ్యారు.
హైదరాబాద్: రాజా రామ్మోహన్ రాయ్ 250 జన్మదినోత్సవాన్ని తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(kishan reddy) హాజరయ్యారు.ఈసందర్భంగా ఇగురం రచయిత గంగాడి సుదీర్(gangadi sudhir) మంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ఇగురం కథాసంపుటి మలి ముద్రణ లోని తొలి కాపీని అందజేశారు, తొలి ముద్రణ లోని వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం కాకుండా, త్వరలోనే రిలీజ్ అయ్యే మలి ముద్రణ తొలికాపీ అందుకోవడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇగురం పేరు తెలంగాణకే ప్రత్యేకమని సుధీర్ రచనలు కూడా అలాగే ప్రత్యేకంగా ఉంటాయని మంత్రి అభినందించారు.