ఎంపీ పిల్లి సుభాష్ వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి వివరణ

ABN , First Publish Date - 2022-05-19T18:59:41+05:30 IST

రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణంపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు.

ఎంపీ పిల్లి సుభాష్ వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి వివరణ

అమరావతి: రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణానికి సంబంధించి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. బోస్ ఈకేవైసీలో జరుగుతోన్న జాప్యం గురించి మాత్రమే మాట్లాడారని తెలిపారు. పిల్లి సుభాష్ చెప్పిన వివరాల మీద అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. ఎంపీ సూచించిన విధంగా సీబీసీఐడీ విచారణ చేపట్టాల్సినంత అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లల్లో సీబీసీఐడీ విచారణ చేపట్టాల్సినంత తప్పులు జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బయట వాళ్లకు ఎంపీ స్థానం ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్య తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ నాయకుడు అని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-19T18:59:41+05:30 IST