భీమేశ్వరాలయంలో మంత్రి కన్నబాబు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-10-17T06:04:04+05:30 IST

సామర్లకోట, అక్టోబరు 16: దేవీ శరన్నవరాత్రి పురష్కరించుకుని సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయంలో మంత్రి కురసాల కన్నబాబు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో పులి నారాయణమూర్తి నేతృత్వంలో

భీమేశ్వరాలయంలో మంత్రి కన్నబాబు ప్రత్యేక పూజలు
భీమేశ్వరాలయంలో స్వామిని దర్శించుకున్న మంత్రి

సామర్లకోట, అక్టోబరు 16: దేవీ శరన్నవరాత్రి పురష్కరించుకుని సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయంలో మంత్రి కురసాల కన్నబాబు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో పులి నారాయణమూర్తి నేతృత్వంలో మంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. మంత్రి తండ్రి కురసాల సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. సామర్లకోట స్టేషన్‌సెంటర్‌ వద్ద గల షిర్డీ సాయిబాబా ఆలయంలో మంత్రి హారతిపూజలు చేశారు. మంత్రి, సత్యనారాయణలను దొరబాబు ఘనంగా సత్కరించారు. స్వామివారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఎలిశెట్టి అమృతానరేష్‌, బి.సత్తిబాబు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు ఊబా జాన్‌ మోజెస్‌, నెక్కంటి సాయి ప్రసాద్‌, యార్లగడ్డ జగదీష్‌, పితాని కృష్ణ, గండ్రోతుల సత్యనారాయణ, కొప్పన రాంబాబు పాల్నొన్నారు. భీమేశ్వరాలయంలో రాష్ట్ర సమాచార కమిషనర్‌ కె.చెన్నారెడ్డి సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2021-10-17T06:04:04+05:30 IST