పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటల వేస్తే రాయితీలు: మంత్రి కన్నబాబు
ABN , First Publish Date - 2020-05-27T04:25:26+05:30 IST
వచ్చే ఏడాది నుంచి పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని మంత్రి కన్నబాబు అన్నారు. రైతుల సమస్యలపై పొగాకు బోర్డు ఆఫీసులో..
గుంటూరు: వచ్చే ఏడాది నుంచి పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని మంత్రి కన్నబాబు అన్నారు. రైతుల సమస్యలపై పొగాకు బోర్డు ఆఫీసులో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రత్యామ్నాయ పంటలు వేస్తే రాయితీలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పొగాకు ధరలను ట్రేడర్లు తగ్గిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు.