చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు: కన్నబాబు

ABN , First Publish Date - 2021-12-15T23:29:37+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో

చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు: కన్నబాబు

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు అని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తామర పురుగుతో రైతులు నష్టపోయారని ఆయన అన్నారు. 2019లో లేవలేని స్థాయిలో బాబుకు  ప్రజలు పురుగు మందు కొట్టారన్నారు. పోగాలం ఎవరికి దాపురించిందో 2019 నుంచి చూస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని బాబు  భ్రష్టు పట్టించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనం అనుకున్నారన్నారు. సొంత మనుషుల చేత భూములు కొనిపించి అమరావతి పెట్టారన్నారు. తోటలు తగులబెట్టి భూములు లాక్కొన్నారన్నారు. భూముల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులతో రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటని ఆగ్రహం వ్యక్తం చేశారు.




రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడుతున్నారన్నారు. చంద్రు వాస్తవాలు మాట్లాడితే తప్పుపడుతున్నారన్నారు. అచ్చెన్నాయుడు తప్పెటగూళ్ళు బ్యాచ్ పులివెందులలో గెలుస్తాం అంటున్నారన్నారు. ముందు కుప్పం సంగతి చూసుకోండని ఆయన హితవు పలికారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు ఎవరూ స్పాన్సరో అందరికి తెలుసన్నారు. రాజధాని కోసం భూములా, భూముల కోసం రాజధానా అన్న అంశంపై చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-15T23:29:37+05:30 IST