డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయం: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2022-03-11T21:52:54+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి పెట్టి వారి అభ్యున్నతి కోసమే

డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయం: మంత్రి కన్నబాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి పెట్టి వారి అభ్యున్నతి కోసమే పథకాలు అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు శుక్రవారం ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.43052.78 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ఆర్థిక సాయం వెళ్తోందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు మంచి రేట్లకు విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 వేల డ్రోన్లతో వ్యవసాయనికి ఊతం ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఎరువుల కోసం ఎక్కడా రైతులు క్యూ లైన్లలో నిల్చొని ఉండాల్సిన పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రమే నిధులు ఇవ్వాలని కన్నబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-11T21:52:54+05:30 IST