ఏ ఒక్క రైతు నష్టపోవద్దు: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-11-14T01:51:19+05:30 IST

ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను

ఏ ఒక్క రైతు నష్టపోవద్దు: మంత్రి కన్నబాబు

అమరావతి: ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను మంత్రి కన్నబాబు అదేశించారు. వర్షాల కారణంగా వాటిల్లిన పంట నష్టాల  పై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. పంట నష్టం అంచనాలను తక్షణమే సిద్ధం చెయ్యాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అత్యధికంగా ఈస్ట్, వెస్ట్, కడప జిలాల్లో వరి పంట నష్టం జరిగిందన్నారు. కడప జిల్లాలో రబీ శనగ పంట, నెల్లూరు జిల్లాలో వరి నారుమడులు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. ఈ క్రాప్ ద్వారా దెబ్బతిన్న రైతులను గుర్తించి సహాయం అందేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. ముంపునీరు దిగి పోగానే ఎన్యుమరేషన్‌ బృందాలను రంగంలోకి దింపి పంట నష్టంపై అంచనా వేయాలని అదేశించారు. 


Updated Date - 2021-11-14T01:51:19+05:30 IST