అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడింది ఎడప్పాడి కాదు.. అమ్మ ఆత్మ!

ABN , First Publish Date - 2021-03-02T12:39:12+05:30 IST

నిత్యం చర్చల్లో వుండే రాష్ట్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి కడంబూర్‌ రాజు మరో సంచలన విషయం బయటపెట్టారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ...

అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడింది ఎడప్పాడి కాదు.. అమ్మ ఆత్మ!

మంత్రి కడంబూర్‌ రాజు

చెన్నై/పెరంబూర్(ఆంధ్రజ్యోతి): నిత్యం చర్చల్లో వుండే రాష్ట్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి కడంబూర్‌ రాజు మరో సంచలన విషయం బయటపెట్టారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడారని చెబుతూ.. ఆ మాటలు ఆయనవి కాదని, అమ్మ జయలలిత ఆత్మ పలికించిందని వ్యాఖ్యానించారు. అమ్మ ఆశీస్సులతో అన్నాడీఎంకే మూడవసారి అధికారం చేపడుతుందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే హ్యాట్రిక్‌ విజయం సాధిస్తుందని, డీఎంకేకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు. కూటమి లేకుండా డీఎంకే పోటీచేసేందుకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. తాను రైతునే అని చెబుతున్న స్టాలిన్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. డీఎంకే ఐ ప్యాక్‌ సంస్థను నమ్ముకొని ఎన్నికలను ఎదుర్కొంటోందని, ఈసారి ప్రజలు మాత్రం గో బ్యాక్‌ అంటూ డీఎంకేకు గుణపాఠం చెబుతారన్నారు. కోవిల్‌పట్టిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎడప్పాడి పళనిస్వామి ఉత్తమ ముఖ్యమంత్రి అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ప్రశంసించారన్నారు. 

Updated Date - 2021-03-02T12:39:12+05:30 IST