ఈఎస్ఐ స్కామ్‌‌లో ఎవరినీ వదిలిపెట్టం: జయరాం

ABN , First Publish Date - 2020-02-21T20:13:04+05:30 IST

చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని మంత్రి జయరాం ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి

ఈఎస్ఐ స్కామ్‌‌లో ఎవరినీ వదిలిపెట్టం: జయరాం

విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని మంత్రి జయరాం ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. అక్రమాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖే సాక్ష్యమని తెలిపారు. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అక్రమంగా చెల్లించిన సొమ్ము రికవరీ చేస్తామని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని మంత్రి జయరాం హెచ్చరించారు.

Updated Date - 2020-02-21T20:13:04+05:30 IST