అభివృద్ధి, సంక్షేమ పథకాలే సీఎం జగన లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-25T05:38:45+05:30 IST

అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన ఏకైక లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జి.జయరామ్‌ పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలే సీఎం జగన లక్ష్యం
బాబాను దర్శించుకుంటున్న మంత్రి జి.జయరామ్‌, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌

మంత్రి జయరామ్‌

గుంటూరు (కార్పొరేషన),  జూలై 24: అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన ఏకైక లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జి.జయరామ్‌ పేర్కొన్నారు. శనివారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని గుంటూరు చైతన్యపురి కాలనీలోని సాయినాధుని దేవాలయాన్ని ఆయన దర్శించారు. ఈ సందర్భంగా సాయినాధునికి ప్రత్యేక పూజలు జరిపించారు.  ఈ సందర్భంగా మంత్రి జయరామ్‌ను ఆలయకమిటీ సభ్యులు మెమెంటో, దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌, మహ్మద్‌ ముస్తఫా, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:38:45+05:30 IST