అభివృద్ధి, సంక్షేమ పథకాలే సీఎం జగన లక్ష్యం
ABN , First Publish Date - 2021-07-25T05:38:45+05:30 IST
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన ఏకైక లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జి.జయరామ్ పేర్కొన్నారు.
మంత్రి జయరామ్
గుంటూరు (కార్పొరేషన), జూలై 24: అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన ఏకైక లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జి.జయరామ్ పేర్కొన్నారు. శనివారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని గుంటూరు చైతన్యపురి కాలనీలోని సాయినాధుని దేవాలయాన్ని ఆయన దర్శించారు. ఈ సందర్భంగా సాయినాధునికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా మంత్రి జయరామ్ను ఆలయకమిటీ సభ్యులు మెమెంటో, దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహ్మద్ ముస్తఫా, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.