ఆశా వర్కర్ల సేవలు మరువలేనివి: మంత్రి జగదీష్ రెడ్డి
ABN , First Publish Date - 2022-02-20T18:21:38+05:30 IST
కరోనా నియంత్రణలో ఫ్రoట్ లైన్ వారియర్స్గా ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట: కరోనా నియంత్రణలో ఫ్రoట్ లైన్ వారియర్స్గా ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశావర్కర్లకు మంత్రి స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఆశా వర్కర్ల జీతం రూ.4 వేలు మాత్రమే అని, తెలంగాణలో ఆశావర్కర్ల జీతం రూ.9,750కి పెంచామని అన్నారు. వైద్య సేవలు అందించడంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నాయన్నారు. దేశంలోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.