‘ప్రోటోకాల్ వివాదం’పై ఏబీఎన్ హెడ్లైన్స్ షోలో మంత్రి జగదీష్ వివరణ
ABN , First Publish Date - 2021-07-29T17:31:29+05:30 IST
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రోటోకాల్ వివాదంపై నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఏబీఎన్ హెడ్లైన్స్ షోలో వివరణ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రోటోకాల్ వివాదంపై నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఏబీఎన్ హెడ్లైన్స్ షోలో వివరణ ఇచ్చారు. గురువారం ఉదయం ఏబీఎన్ హెడ్లైన్స్ షో ప్రతినిధితో ఫోన్లో మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి.. తాము ప్రోటోకాల్ పాటించామని చెప్పారు. ప్రోటోకాల్ను అధికారులు నిర్ణయిస్తారని, ఆ విషయం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. తన వద్ద నుంచి మైక్ను లాగేసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డే ఒప్పుకున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.