Jagadish reddy comments: కుటుంబ స్వార్థం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా:
ABN , First Publish Date - 2022-08-12T19:44:42+05:30 IST
కుటుంబ స్వార్థం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
నల్గొండ : కుటుంబ స్వార్థం కోసమే రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) రాజీనామా చేశారని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish reddy) ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఆత్మగౌరవాన్ని బీజేపీ(BJP) దగ్గర తాకట్టు పెట్టారన్నారు. టీఆర్ఎస్(TRS) ప్రభుత్వ హయాంలోనే మునుగోడు అభివృద్ధి చెందిందని తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు బైపోల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానానికి బీజేపీ, కాంగ్రెస్ (Congress) పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. దేశ పరిస్థితుల దృష్ట్యా వామపక్షాల మద్దతు టీఆర్ఎస్కే అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.