ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అబద్ధాల కోరు

ABN , First Publish Date - 2020-10-24T09:35:23+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాల కోరు అని, మాట మీద నిలబడే వ్యక్తి కాదని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎన్నోసార్లు రాజకీయ

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అబద్ధాల కోరు

గడ్డం పెంచి మొసలి కన్నీరు కారుస్తున్నారు:  మంత్రి జగదీశ్‌రెడ్డి


హుజూర్‌నగర్‌ , అక్టోబరు 23: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాల కోరు అని, మాట మీద నిలబడే వ్యక్తి కాదని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎన్నోసార్లు రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి మాట తప్పారని, గడ్డం పెంచుకుని మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. హుజూర్‌నగర్‌లో చెల్లని ఉత్తమ్‌.. దుబ్బాక వెళ్లి కాం గ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తాడా?అని ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా హు జూర్‌నగర్‌లో శుక్రవారం జరిగిన మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించలేక ఉత్తమ్‌ పారిపోయారన్నారు. సాగుకు ఉచిత విద్యుత్తును ఎత్తివేసే దిశగా కేంద్రం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-10-24T09:35:23+05:30 IST