సాగు చేసిన భూములకే రైతుబంధు: జగదీశ్రెడ్డి
ABN , First Publish Date - 2020-06-06T08:39:39+05:30 IST
బీడు భూములకు, గుట్టలకు రైతుబంధు ఇచ్చేది లేదని, సాగులో ఉన్న భూములకే పథకం వర్తిస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
ఆత్మకూర్(ఎస్), జూన్ 5: బీడు భూములకు, గుట్టలకు రైతుబంధు ఇచ్చేది లేదని, సాగులో ఉన్న భూములకే పథకం వర్తిస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో కేవీకే రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమిలో పాల్గొన్నారు. నాగలితో పొలాన్ని దున్నిన ఆయన అనంతరం జరిగిన సదస్సులో మాట్లాడారు. మూస ధోరణిలో వరి, మొక్కజొన్నను సాగు చేసి రైతులు అప్పులపాలు కావొద్దని, వాణిజ్య పంటలు వేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.