సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట: మంత్రి జగదీష్ రెడ్డి
ABN , First Publish Date - 2022-02-24T23:59:13+05:30 IST
సీఎం కేసీఆర్ పాలనలో సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణాలో పెద్ద పీట
యాదాద్రి: సీఎం కేసీఆర్ పాలనలో సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణాలో పెద్ద పీట వేయడం జరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ను ఘనతను కేసీఆర్ గుర్తించారన్నారు. అధికారికంగా సేవాలాల్ జన్మదిన వేడుకలను జరిపేది ఒక్క తెలంగాణాలోనేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా పండుగలు, పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నది కేసీఆర్ ఒక్కరేనన్నారు. సంత్ సేవాలాల్ సేవలు దేశానికే గర్వకారణమన్నారు. మానసిక రుగ్మతలను రూపుమాపిన యోధుడు సేవాలాల్ అని ఆయన కొనియాడారు.