అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

ABN , First Publish Date - 2020-10-25T06:59:43+05:30 IST

పూల పండుగలో పాల్గొన్న మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గౌరమ్మను వేడుకున్నానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు

అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

బతుకమ్మ వేడుకల్లో

మంత్రి ఈటల రాజేందర్‌


హుజూరాబాద్‌, అక్టోబరు 24:  పూల పండుగలో పాల్గొన్న మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గౌరమ్మను వేడుకున్నానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం హుజూరాబాద్‌ పట్టణంలోని సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది మ హిళలు ప్రభుత్వ నిబంధనలు పాటించి ఇళ్లలోనే బతుక మ్మ పండుగను చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


జమ్మికుంటలో..

జమ్మికుంట: హైద్రాబాద్‌లోని నెక్లేస్‌ రోడ్‌లా జమ్మికుంట నాయిని చెరువును త్వరలో అభివృద్ది చేయబోతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలకు మంత్రి హాజరయ్యారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన వెంట జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ పొనగంటి సంపత్‌, వైస్‌ చైర్మన్‌ దేశిని స్వప్న-కోటి, మాజీ మార్కెట్‌ కమిటి చైర్మన్‌ తుమ్మేటి సమ్మిరెడ్డి, కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య, రావికంటి రాజు, శ్రీపతి నరేష్‌, దెయ్యాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T06:59:43+05:30 IST