పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తాం: ఈటల
ABN , First Publish Date - 2020-10-01T00:49:18+05:30 IST
పేదలకు ఉచిత, నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్పై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు
హైదరాబాద్: పేదలకు ఉచిత, నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్పై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వాస్పత్రుల్ని బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ నిబంధనలకు అనుగుణంగా కొత్త ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలన్నారు.