నిర్మల్ పట్టణంలో ముంపు ప్రాంతాల్లో ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన

ABN , First Publish Date - 2022-07-10T19:55:43+05:30 IST

పట్టణంలో గత మూడురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

నిర్మల్ పట్టణంలో ముంపు ప్రాంతాల్లో ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన

నిర్మల్: పట్టణంలో గత మూడురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.ముఖ్యంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, చిన్ననాలాలు,కాలువలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో జనజీవనం స్తంభించి పోయింది. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు రావడంతో ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు. ఈమేరకు వర్ష ప్రభావిత ప్రాంతంలో జిల్లామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. 


ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దని ప్రభుత్వం సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాంతి నగర్ చౌరస్తాలో రోడ్ పై నిలిచిపోయింది. ఈ పరిస్థితిని కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.డ్రైనేజీ లో ఎప్పటికప్పుడు పూడిక తీయాలని, రోడ్ లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.భవిష్యత్ లో ఇలాంటీ పరిస్థితులు తలెత్తకుండా పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు.

Updated Date - 2022-07-10T19:55:43+05:30 IST