నిర్మల్: బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. విద్యాలయంలో సౌకర్యాలు, ఇతర అంశాలను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసువెళ్తామని చెప్పారు. భవిష్యత్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి