నిర్మల్: జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఓటర్లు ఓటేసేందుకు బారులు తీరారు. అటు భైంసాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.