ఏడాదిలోగా నిర్మల్కు సాగునీరు: ఇంద్రకరణ్
ABN , First Publish Date - 2020-05-31T08:17:30+05:30 IST
కాళేశ్వరం 27, 28వ ప్యాకేజీల ద్వారా ఏడాదిలోగా నిర్మల్ జిల్లాకు సాగు నీరందించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి...
దిలావర్పూర్, మే 30: కాళేశ్వరం 27, 28వ ప్యాకేజీల ద్వారా ఏడాదిలోగా నిర్మల్ జిల్లాకు సాగు నీరందించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి వద్ద నిర్మించిన 27వ ప్యాకేజీ పంప్హౌజ్ పనులను సీఎం ఓఎ్సడీ శ్రీధర్రావు దేశ్పాండేతో కలిసి శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. 27, 28వ ప్యాకేజీలకు సంబంధించి ఇప్పటికే 65ు పనులు పూర్తయ్యాయన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పంటలకు నీరందించే దిశగా పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు.