తెలంగాణ ఉద్యమ గ‌తిని మార్చిన దీక్షా దివ‌స్: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-29T21:30:02+05:30 IST

పదకొండు రోజుల సుదీర్ఘ దీక్షతో యావ‌త్తు తెలంగాణ స‌మాజాన్ని ఏకతాటి మీదకు తీసుకువచ్చి కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష చరిత్రపుటల్లో నిలిచింద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ఉద్యమ గ‌తిని మార్చిన దీక్షా దివ‌స్: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైదరాబాద్: పదకొండు రోజుల సుదీర్ఘ దీక్షతో  యావ‌త్తు తెలంగాణ స‌మాజాన్ని ఏకతాటి మీదకు తీసుకువచ్చి కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష చరిత్రపుటల్లో నిలిచింద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. న‌వంబ‌ర్ 29 దీక్షా దీవస్ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను  ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ గతిని 'దీక్షా దివస్' మార్చిందని తెలిపారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షా తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు దారితీసిందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం చావుదాకా వెళ్లిన కేసీఆర్ త్యాగం మరువరానిదని గుర్తుచేశారు. తెలంగాణ గతిని మార్చిన ఈ దినాన్ని అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

Updated Date - 2021-11-29T21:30:02+05:30 IST