హరిత నిధి ఏర్పాటు పచ్చదనానికి తోడ్పాటు
ABN , First Publish Date - 2021-10-01T21:41:07+05:30 IST
హరిత నిధి ఏర్పాటుతో పచ్చదనానికి మరింత తోడ్పాటు లభిస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: హరిత నిధి ఏర్పాటుతో పచ్చదనానికి మరింత తోడ్పాటు లభిస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హరిత నిధి ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తు చేయడంతో పాటు , ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు.
హరిత నిధి ఏర్పాటుకు అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో స్వాగతించడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధి ఏర్పాటుతో తెలంగాణకు హరితహార కార్యక్రమ నిర్వహణ మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.