మహాగణపతిని దర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-09-17T20:16:30+05:30 IST

ఖైరతాబాద్ గణేషున్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్ర‌వారం మహాగణపతి దర్శనానికి వెళ్లిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి గణేష్ ఉత్సవ కమిటీ స‌భ్యులు స్వాగతం పలికారు.

మహాగణపతిని దర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైద‌రాబాద్: ఖైరతాబాద్ గణేషున్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దర్శించుకున్నారు.  శుక్ర‌వారం మహాగణపతి దర్శనానికి వెళ్లిన  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి గణేష్ ఉత్సవ కమిటీ స‌భ్యులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతాయని, కానీ గత సంవత్సరం కరోనా కారణంగా పండగ సందడి లేకున్నా ఈసారి మాత్రం ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.


నిమజ్జన ర్యాలీలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కోవిడ్ మహమ్మారినిపూర్తిగా నివారించాలని ఆ దేవుడిని కోరుకున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే  కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని అన్నారు. 

Updated Date - 2021-09-17T20:16:30+05:30 IST