అమరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పురోగమిస్తోంది:Indrakaran reddy
ABN , First Publish Date - 2022-06-02T20:06:03+05:30 IST
త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అమరుల ఆశయాలకనుగుణంగాే పురోమిస్తోందని పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు
నిర్మల్: త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అమరుల ఆశయాలకనుగుణంగాే పురోమిస్తోందని పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ పురోగమిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఉదయం శాస్త్రినగర్ లోని క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, ప్రస్తుతం అవన్నీ సాకారం అవుతుండటం హర్షణీయమన్నారు.