హైదరాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫొటోగ్రఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. వరదలు, కరువులు, ఉద్యమాలు, పోరాటాలను సమాజానికి తెలపాలన్న తపనతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫోటోలు తీస్తుంటారన్నారు. అదేవిధంగా అందమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, విషాద సన్నివేశాలు ఇలా అనేక వెలకట్టలేని దృశ్యాలను ఫోటో పదిలంగా ఉంచుతుందని వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చని పేర్కొన్నారు.సన్నివేశాన్ని గుర్తుండిపోయేలా ఫోటోగ్రఫర్లు తీసిన ఫోటోలు భావితరాలకు మధురమైన స్మృతులుగా మిగిలిపోతున్నాయన్నారు.