లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-07-31T19:47:47+05:30 IST
ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బోనాలకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆద్వర్యంలో అన్ని సదుపాయాలను సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తామని పేర్కొన్నారు.
బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.