కేంద్ర మంత్రుల‌కు సాద‌రంగా ఆహ్వానం ప‌లికిన మంత్రి అల్లోల‌

ABN , First Publish Date - 2022-02-18T22:51:06+05:30 IST

మేడారం జాత‌ర‌ సందర్భంగా రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

కేంద్ర మంత్రుల‌కు సాద‌రంగా ఆహ్వానం ప‌లికిన మంత్రి అల్లోల‌

వరంగల్: మేడారం జాత‌ర‌ సందర్భంగా రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వ‌రుస‌గా మూడ‌వ‌ రోజు కూడా మేడారంలోనే వుండి బిజీ బీజీగా గ‌డిపారు. సామ‌న్య భ‌క్తుల‌తో పాటు మంత్రులు, వీఐపీల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుంగా అన్నీ తానై ఏర్పాట్ల‌ను చూస్తున్నారు.  సమ్మ‌క్క‌- సార‌ల‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే అతిధుల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సాద‌రంగా స్వాగ‌తం ప‌లుకుతున్నారు. శుక్ర‌వారం మేడారం జాత‌ర‌కు వ‌చ్చిన కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి, కేంద్ర గిరిజ‌న శాఖ మంత్రి రేణుక సింగ్, రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కు సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు. అలాగే జాతరంతా క‌లియ‌తిరుగుతూ ఏర్పాట్లపై అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు.

Updated Date - 2022-02-18T22:51:06+05:30 IST