క్షతగాత్రులను ఆదుకున్న మంత్రి
ABN , First Publish Date - 2022-06-27T04:39:30+05:30 IST
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి క్షతగాత్రులను ఆదుకొని ఆసుపత్రికి తరలించారు.
వెంకటాచలం, జూన్ 26: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి క్షతగాత్రులను ఆదుకొని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి మండలంలోని కురిచెర్లపాడు వద్ద అడవిపంది అడ్డురావడంతో ఆటో ప్రమదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న కె. వెంకటేశ్వర్లు, కె. సుబ్బయ్య, సుధాకర్ గాయపడి రోడ్డుపై పడిఉన్నారు. ఇస్లాంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకుని అటుగా వెళుతున్న మంత్రి కాకాణి వారిని గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపి వివరాలు తెలుసుకున్నారు. స్పందించిన మంత్రి బాధితులను తన వాహనంలో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. క్షతగాత్రులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.