ప్రజలు సహకరిస్తేనే కరోనా కట్టడి సాధ్యం: మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2021-05-08T22:16:31+05:30 IST
నేటి నుంచి వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసే ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.
మెదక్: నేటి నుంచి వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసే ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ మార్కెట్ కమిటీ ఆవరణలో దుకాణాల సముదాయాన్ని మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో బీహార్ కూలీలు వెళ్లిపోవడంతో హమాలీల సమస్య ఏర్పడిందని మంత్రి హరీష్రావు చెప్పారు.
ప్రైవేటు ట్రాక్టర్లతోనూ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేసేందుకు ఆదేశాలిచ్చామన్నారు. ఇప్పటికీ జిల్లాలో లక్ష మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. జిల్లాలో లక్షా 40 వేల కుటుంబలను ఇంటింటి సర్వే చేయగా 6 వేల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందన్నారు. ప్రజలు సహకరిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని చెప్పారు. జిల్లాలో 240 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో 600 బెడ్స్కు అనుమతి ఇచ్చినట్లు ప్రకటించారు. రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు అవసరమైన మేర జిల్లాలో నిల్వలున్నాయని మంత్రి హరీష్రావు తెలిపారు.