ధరణి పోర్టల్ ఒక అద్భుతం: మంత్రి Harish rao

ABN , First Publish Date - 2022-06-14T16:53:35+05:30 IST

ధరణి పోర్టల్ ఒక అద్భుతం అని మంత్రి హరీష్ రావు అన్నారు.

ధరణి పోర్టల్ ఒక అద్భుతం: మంత్రి Harish rao

సిద్దిపేట: ధరణి పోర్టల్ ఒక అద్భుతం అని మంత్రి హరీష్ రావు(Harish rao) అన్నారు. మంగళవారం ఉదయం ములుగు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ధరణి పోర్టల్ సమస్యలపై  హరీష్‌రావు ముఖా ముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ములుగు గ్రామ రెవెన్యూ సమస్యలు తీర్చి ఇదే విధంగా రాష్ట్రం అంత చేద్దాం అని ఆలోచన ఉందన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం అనేక సమస్యలు ఉండేదని తెలిపారు. ధరణి వచ్చాక గజ్వెల్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ములుగు తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, సీఎంఓఎస్డీ స్మిత సబర్వాల్, రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ములుగు రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-14T16:53:35+05:30 IST