మతాల మధ్య చిచ్చుపెడుతున్న పార్టీ బీజేపీ: Harish rao
ABN , First Publish Date - 2022-03-03T18:04:09+05:30 IST
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు.
నిర్మల్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి సౌకర్యాలు లేవన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి స్వార్థం కోసం పని చేస్తున్న పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. గ్రామాలలో టీఆర్ఎస్ కార్యకర్తలు చర్చలు పెట్టి కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. పక్కన ఉన్న మహారాష్ట్రలో పింఛన్ రూ.500 ఉంటే తెలంగాణలో రూ.2016 ఇస్తున్నామని తెలిపారు.
మహారాష్ట్ర సరిహద్దు రైతులు తెలంగాణలో భూములు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఉచిత కరెంటును ఉపయోగించుకుంటున్నారన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్లీ పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతుందని విమర్శించారు. ఉత్తర ప్రదేశ్లో పేద ప్రజలకు అందని వైద్యం తెలంగాణ ప్రజలకు అందుతుందన్నారు. విద్యాపరంగా తెలంగాణ దేశంలో మూడవ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.