Huzurabad వేదికగా మంత్రి హరీష్ కీలక ప్రకటన..

ABN , First Publish Date - 2021-10-24T19:43:00+05:30 IST

జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ...

Huzurabad వేదికగా మంత్రి హరీష్ కీలక ప్రకటన..

కరీంనగర్ : హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలిస్తే.. రైతుల రుణం వడ్డీతో సహా మాఫీ చేస్తామని మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ ఇచ్చారు. జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ..  57 ఏళ్లకు పెన్షన్, 5వేల ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు. ఈటెల రాజేందర్ గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపి నేతలు మీటింగ్ పెట్టి ధరలు తగ్గిస్తామని చెబుతున్నారా అని ప్రశ్నించారు. బీజేపి గెలిస్తే రెండో తేదీ తర్వాత సిలిండర్ ధర పెంచుతారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు కేంద్రం కారణం కాదని కిషన్ రెడ్డి చెప్పారని.. తాను సవాల్ విసిరితే మాత్రం చర్చకు రావడం లేదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-10-24T19:43:00+05:30 IST