ఈటల తన స్వార్థం కోసమే బీజేపీలో చేరారు: Harish rao

ABN , First Publish Date - 2021-10-11T19:43:23+05:30 IST

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈటల తన స్వార్థం కోసమే బీజేపీలో చేరారు: Harish rao

కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల లేనిపోని మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబెట్టాయని గుర్తు చేశారు. ఈటల తన స్వార్థం కోసమే బీజేపీలో చేరారని తెలిపారు.  వచ్చే మార్చి లోపు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని తెలిపారు. రాజేందర్ గెలిస్తే ఆయన ఒక్కడే గడ్డకు పడతారని హరీష్‌రావు అన్నారు. .

Updated Date - 2021-10-11T19:43:23+05:30 IST