బ్రహ్మకుమారీస్ ధాన్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి హరీష్

ABN , First Publish Date - 2021-03-04T18:58:10+05:30 IST

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈరోజు మల్కాజిగిరిలోని బ్రహ్మకుమారీస్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు.

బ్రహ్మకుమారీస్ ధాన్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి హరీష్

హైదరాబాద్: హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో  తీరిక లేకుండా ఉన్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈరోజు మల్కాజిగిరిలోని బ్రహ్మకుమారీస్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి బ్రహ్మకుమారీలు ధ్యాన ప్రక్రియ ప్రాశస్త్యాన్ని వివరించారు. ధ్యాన కేంద్రంలో ఉన్న చిత్ర పటాలు చూపిస్తూ వాటి అర్థాన్ని ఆయనకు తెలిపారు. అనంతరం బ్రహ్మకుమారీస్ జెండాను రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు, స్థానిక నేతలు హాజరయ్యారు.

Updated Date - 2021-03-04T18:58:10+05:30 IST