కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదిద్దాం: మంత్రి హరీశ్
ABN , First Publish Date - 2021-12-18T22:24:50+05:30 IST
రైతు రాబందు అయిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదిద్దామని మంత్రి హరీశ్రావు అన్నారు.
సిద్దిపేట: రైతు రాబందు అయిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదిద్దామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ నెల 20న పల్లె పల్లెనా రైతు ధర్నాపై సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమ్మడమే అలవాటుగా మరీన కేంద్ర ప్రభుత్వానికి..తెలంగాణ రైతుల వడ్లు కొనడం చేతకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలని పిలుపునిచ్చారు. రైతుల పక్షనా నిలవాలని.. ధర్నాలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలన్నారు. రైతు శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రభుత్వ ద్యేయమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.