బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయి.. జియో వచ్చింది: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-09-15T22:57:06+05:30 IST

బీజేపీపై రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర

బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయి.. జియో వచ్చింది: హరీష్‌రావు

 కరీంనగర్: బీజేపీపై రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక బీఎస్‌ఎన్‌ఎల్‌ పోయి.. రిలయన్స్ జియో వచ్చిందని హరీష్‌రావు అన్నారు. రేపు ఎల్‌ఐసీ పరిస్థితి అదే కాబోతుందన్నారు. ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే అభివృద్ధి జరగదని హరీష్‌రావు పేర్కొన్నారు. ఎంపీగా బండి సంజయ్ కనీసం 10 లక్షల పని చేశాడా అని హరీష్‌రావు ప్రశ్నించారు. ఎంపీగా సంజయే చేయనప్పుడు, ఈటల చేస్తాడా అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. 

Updated Date - 2021-09-15T22:57:06+05:30 IST