సిద్ధిపేట ప్రజలారా భయపడకండి : మంత్రి హరీష్

ABN , First Publish Date - 2020-07-12T02:06:07+05:30 IST

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిద్ధిపేట ప్రజలారా భయపడకండి : మంత్రి హరీష్

సిద్ధిపేట : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గకపోవడం, మరోవైపు వ్యాక్సిన్ ఇప్పట్లో రాదని వార్తలు వస్తుండటంతో మరింత ఆందోళన ఎక్కువయ్యింది. ఈ తరుణంలో ప్రజాప్రతినిధులు.. నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. సిద్ధిపేటలో కరోనా పెరుగుతుండటంతో మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు.


జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఐసోలేషన్‌కు అదనంగా స్థానిక ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో 100 పడకల కోవిడ్ వార్డును ఈ నెల 15న ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజలు ఆరోగ్యంపై ఏ మాత్రం అనుమానం ఉన్నా.. స్థానిక పీహెచ్‌సీలో సంప్రదిస్తే సరిపోతుందన్నారు. ఆసుపత్రిలో వ్యాది నిరోధకశక్తిని పెంచే అన్ని రకాల ఆహార పదార్ధాలు అందిస్తామని జిల్లా ప్రజలకు హరీష్ అభయమిచ్చారు.

Updated Date - 2020-07-12T02:06:07+05:30 IST