నీట మునిగిన పంప్ హౌజ్
ABN , First Publish Date - 2021-08-31T01:39:33+05:30 IST
సోమవారం వేకువ జామున నుంచి మునుపెన్నడూ లేని విధంగా సిద్దిపేట జిల్లాలో
సిద్దిపేట: సోమవారం వేకువ జామున నుంచి మునుపెన్నడూ లేని విధంగా సిద్దిపేట జిల్లాలో 4 గంటల్లో 13 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసిందని ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. కుండపోత వర్షంతో ఉధృతమైన వరద నీరు వచ్చిందన్నారు. దీంతో చిన్నకోడూరు మండలంలోని మల్లారం గ్రామంలో గల హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సీవరేజి బోర్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లోని 6.6 KV పంప్ హౌజ్ నీట మునిగిందన్నారు. పంప్ హౌజ్ నీట మునకతో హైదారాబాద్ డ్రింకింగ్ వాటర్తో పాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్ పరిధిలోని 1950 హబిటేషన్లకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని ఆయన తెలిపారు.
హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సీవరేజి బోర్డ్ ఎండీ దాన కిషోర్ నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామన్నారు. ఒకటి నుంచి రెండు రోజుల్లో తాత్కాలిక ప్రాతిపదికన రిస్టోరేషన్ చర్యలు చేపడతామని హరీష్ రావు తెలిపారు.